సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కొవ్వూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందించారు. వెంటనే వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.