పుదుచ్చేరి లోక్ సభ స్థానానికి ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో యానాం, మాహే, పుదుచ్చేరి, కారైకల్ నాలుగు రీజియన్లలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పి. ప్రియదర్శిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు