గణేశ్ నిమజ్జనంలో అపశృతి

56చూసినవారు
గణేశ్ నిమజ్జనంలో అపశృతి
తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు పట్టణంలోని బసిరెడ్డిపేట రేవు వద్ద మంగళవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి జరిగింది. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన పి. రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. గ్రామం నుంచి గణేశ్ విగ్రహాన్ని పట్టణంలో రేవుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్