కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధి వేట్లపాలెం రైలు పట్టాలపై రైలు కింద పడి ఒక యువ జంట శనివారం ఆత్మ హత్యకు పాల్పడ్డారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో మృతదేహాలు గుర్తించే వీలు కూడా లేకుండా పోయింది. సామర్లకోట రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతుల సంబంధీకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.