పిఠాపురం పట్టణం స్థానిక అగ్రహారం నందలి గల శ్రీ ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ ఆవరణలో గల కళావేదిక నందు శృతిలయ సంగీత నాట్యాలయం ప్రవీణా విశ్వేశ్వరరావు మాస్టారు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. గణేష్ కౌతం నాట్యంతో కార్యక్రమం ప్రారంభించగా రామాయణశబ్దం, దశావతారాలు, ఒంటి కీర్తనల నృత్యాలు, నాట్య కళాభిమానులను ఆకట్టుకున్నాయి.