యు. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారులో నిర్వహిస్తున్న కోడిపందేలపై శనివారం యు. కొత్తపల్లి పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1, 150 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ మీడియాకు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూద క్రీడల జోలికిపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.