శంఖవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంకు శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు నిర్వహించారు. ఈ మేరకు అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.