రాజమండ్రిలోని జిల్లా రిటైర్డ్ పోలీస్ అసోసియేషన్ సభ్యులకు జాంపేటలోని వారి కార్యాలయం వద్ద జిల్లా సైబర్ కమాండో టీం సైబర్ మోసాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ ధరకే వస్తువులు అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని పేర్కొన్నారు.