రాజమండ్రిలో గెలిచిన ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో పోటీ పడాలి కానీ, ధ్వంసాలు, దహనకాండలు చేయడానికి కాదని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రాత్రి తన ప్రచార వాహనాన్ని దగ్ధం చేసింది ప్రతిపక్ష నేతలేనని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై దాడులు జరిగాయని అన్నారు. కానీ వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు.