స్వతంత్ర జనతా పార్టీ (రిపబ్లిక్) అనుబంధ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసామని, ఏ విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై ఈ విద్యార్థి సంఘం పనిచేయబోతుందని పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్ ఉద్ఘాటించారు. ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుదే వంశీకి నియామక పత్రం అందచేసారు.