పేదరిక నిర్మూలన, విజన్ 2047 అంశాల నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. విజయానంద్, పీ4 సర్వే ప్రక్రియ, మార్గదర్శకాలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి కమిషనర్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.