ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ గా కె. తిలక్ కుమార్ గురువారం రాజమండ్రిలో బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం విద్యుత్ కేంద్ర కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.