రాజోలులో జనసేన-టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొనగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇరుపార్టీల శ్రేణులకు సర్దిచెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒక దానిపై 'కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి' అని ముద్రించడంతో టీడీపీ శ్రేణులు జనసేన నేతలను నిలదీశారు. కాసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే దేవ అక్కడకు వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది.