సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి శాంతి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. బహుళ ద్వాదశి సందర్భంగా స్థానాచార్యులు రంగాచార్యులు, ముఖ్య అర్చక స్వాములు శ్రీనివాస్ కిరణ్, వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వారి శాంతి కళ్యాణోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.