విజయవాడలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం సభకు కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామం నుంచి అధిక సంఖ్యలో హిందూ బంధువులు పయనమయ్యారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు ఆదివారం వేకువజామున ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలివెళ్లారు. వారందరికీ అదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లగుడు అప్పలస్వామి(దొరబాబు) అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.