తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని-అన్నవరం స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన ఆర్లి ఈశ్వరరావు (23) గజపతినగరం నుంచి అన్నవరం రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడన్నారు. మృతుడి వద్ద సెల్ ఫోన్ ఆధారంగా దివిస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా గుర్తించామన్నారు.