నాగాయలంక మండలంలోని టి. కొత్తపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి బస్వారావు ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తన కాలుని కోల్పోవడంతో బుధవారం రాత్రి మండలి వెంకట్రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ద్వారా రూ. 10 వేలు సాయాన్ని ఆయన చేతులు మీదుగా అందజేశారు. అలాగే వారికీ ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.