మోపిదేవి జనసేన పార్టీ మండల కార్యాలయంలో మోపిదేవి మండల జనసేన పార్టీ ఆత్మీయ కలయిక కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పుషడపు రత్న గోపాల్ ఆధ్వర్యంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్ అధ్యక్షతన ఈ జనసేన పార్టీ ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అవనిగడ్డ అభ్యర్థి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, అందర్నీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు