మోపిదేవిలో చేపలపై విష ప్రయోగం

73చూసినవారు
మోపిదేవిలోని ఓ ఫిష్ ల్యాండ్లో చేపలపై విష ప్రయోగం జరిగి 180 కేజీలు చేపలు మృత్యువాత పడిన ఘటన ఆదివారం జరిగింది. గోపాలం (నాని) కు చెందిన ఫిష్ ల్యాండ్లో సమీప బంధువులే విష ప్రయోగం చేసి ఆర్థికంగా నష్టపరిచారని ఆరోపించారు. రూ. 25వేలు విలువ చేసే 180 కేజీల చేపలు చనిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ సత్యనారాయణ దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్