
భారత్-పాక్కు కంగ్రాట్స్: ట్రంప్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్, "భారత్- పాకిస్థాన్ నాయకత్వాలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకున్నందుకు భారత్-పాక్కు థ్యాంక్యూ.. అలాగే కంగ్రాట్స్" అంటూ రాసుకొచ్చారు.