మచిలీపట్నం: కవయిత్రి మొల్లకు ఘన నివాళులు

79చూసినవారు
ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో గురువారం డిఆర్ఓ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మొల్ల రామాయణాన్ని రచించిందని తెలిపారు. ఆమె పేరిట తపాలా శాఖ స్టాంప్ కూడా ముద్రించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ ప్రసాద్, శీను నాయక్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్