రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల చెన్నకేశవరావు (కేశిబాబు) తండ్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాదెండ్ల చెన్నకేశవరావు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.