టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని వారి నివాసంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లక్షల 82 వేల పై చేలుకు మెజార్టీతో ఎంపీగా గెలిచిన సందర్భంగా కేశినేని శివనాథ్(చిన్ని)ను నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా చంద్రబాబు నాయుడును కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) శుభాకాంక్షలు తెలిపారు.