పెడన మండల మడక గ్రామానికి చెందిన మావుళ్లు అనే ఉపాధి కార్మికుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థుడు జోగి నాగరాజు శనివారం ఆరోపించారు. ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు లేవని, ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యతలు మరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.