పెడన: రోడ్డు ప్రమాదం - నలుగురికి తీవ్ర గాయాలు

82చూసినవారు
మచిలీపట్నం - నర్సాపురం 216 జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన పెడన మండలం బల్లిపర్రు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయని, ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై బైక్ ల పార్ట్ లు చిందర వందరగా పడిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్