భారత్-పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళీనాయక్కు వైయస్ఆర్సీపీ పెనమలూరు కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు మురళీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమని తెలిపారు.