రామోజీ రావు అందరికీ ఆదర్శం : మోహన్ శ్యాం ప్రసాద్

81చూసినవారు
రామోజీ రావు అందరికీ ఆదర్శం : మోహన్ శ్యాం ప్రసాద్
మీడియా రంగానికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి రామోజీ రావు అని డబుల్ హార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యాం ప్రసాద్ అన్నారు. భరతమాత ముద్దు బిడ్డ, పద్మవిభూషణ్ వంటి ఎన్నో గొప్ప పురస్కారాలను సొంత చేసుకున్న వ్యక్తి రామోజీ రావు అని అన్నారు. విత్తనం నుంచి వృక్షం లెక్క అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీ రావు. ఈనాడు, ఈటీవీ ఛానెల్స్ ను స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పించి, ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంలో ప్రముఖ పాత్రను పోషించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రామోజీ రావు మరణ వార్త తన మనసును కలచివేసిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్