గంపలగూడెం మండలం పెనుగొలను లో బోటి మీద వేంచేసి యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో ఆషాడ మాసం సందర్భంగా రేపు శుక్రవారం శాకంబరీ అలంకరణ జరుగును. శ్రీ చెంచులక్ష్మి రాజ్యలక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామి కి వివిధ కాయకూరలతో అలంకరణ చేస్తున్నట్లు ఆలయ పూజారి వడ్డెరపు వెంకటేశ్వర స్వామి గురువారం తెలిపారు.