చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు గాను మండల టీడీపీ శ్రేణులు ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు. మండల టీడీపీ నేతలు, మహిళలు మునగచర్ల గ్రామం నుండి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, కనకదుర్గమ్మ దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యెే తంగిరాల సౌమ్య వారితో పాటు కలసి కొంతమేర పాదయాత్ర నిర్వహించారు.