దొంగిలించిన వాహనాలు కొనుగోలు కోడూరులో అధికమైన నేపథ్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ద్విచక్ర వాహనాల తనిఖీలు శనివారం అవనిగడ్డ సీఐ యువకుమార్ ముమ్మరం చేశారు. గత నాలుగు రోజుల క్రితం కంకిపాడు ఎస్ఐ సందీప్ నేతృత్వంలో వివిధ ప్రాంతాలలో దొంగిలించిన 30 వాహనాలు కోడూరులో కొనుగోలుదారుల వద్ద రికవరీ చేశారు. వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సిఐ తెలిపారు.