దివి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పార్టీ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ టీడీపీ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన దివి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.