వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి త్రాగునీటి చెరువులు పూర్తి స్థాయిలో నింపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచినీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు సమర్ధవంతమైన త్రాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అనువైన పనులపై సమీక్ష నిర్వహించారు.