అవనిగడ్డ: అమరునికి ఘన నివాళులు

70చూసినవారు
అవనిగడ్డ: అమరునికి ఘన నివాళులు
పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న దాడుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ మృతి చెందడంతో కూటమి నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి అవనిగడ్డలో భారీ ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి మురళి నాయక్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల త్యాగనిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్