2587వ బుద్ధ జయంతిని పురస్కరించుకుని ఘంటసాలలోని బౌద్ధ మ్యూజియంలో ఈనెల 12వ తేదీన ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం ఘంటసాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులు ఇక్కడికి వచ్చి బుద్ధుని చిత్రపటాలు చిత్రీకరణ చేయడం జరుగుతుందని, సాయంత్రం చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.