ఘంటసాల: బుద్ధ జయంతికి ముమ్మరంగా ఏర్పాట్లు

76చూసినవారు
ఈనెల 12వ తేదీన ఘంటసాలలో జరిగే బుద్ధ జయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం శయన బుద్ధ ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఉపాధి పథకం ఏపీవో ఎస్. రాజ్ కుమార్, పంచాయితీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్, బోలెం అర్జున రావులు పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో చెత్తాచెదారం తొలగించడంతో యంత్ర సహాయంతో పిచ్చి చెట్లు తొలగించారు.

సంబంధిత పోస్ట్