
బిహార్ గూండాల రాజ్యంగా మారిపోయింది: రాహుల్ గాంధీ
సీఎం నీతీష్ కుమార్ పాలనలో బిహార్ గూండాల రాజ్యంగా మారిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బిహార్ రాజధాని పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై రాహుల్ స్పందించారు. నేడు బిహార్ దోపిడీ, కాల్పులు, హత్యల నీడలో నివసిస్తోందని.. రాష్ట్రంలో నేరాలు జరగడమనేది సాధారణంగా మారిపోయిందన్నారు. వీటిని నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.