కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడితే పౌర హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. మేకావారిపాలెం గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు మేకా సీతారామయ్య శతజయంతి వేడుకలు కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఆదివారం నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టులు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని పేర్కొన్నారు.