వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. శనివారం కోడూరులో పలు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వరాదని, వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని వాహన యజమానులకు జరిమానాలు విధించారు. అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని తెలియచేయాలని కోరారు.