ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంచి మెజారిటీ సాధించేలా కృషి చేయాలని శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ కోరారు. కృత్తివెన్ను మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జ్ లతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విద్యావంతుడైన రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించడం ద్వారా పట్టభద్రులకు మేలు జరుగుతుందని తెలిపారు.