చల్లపల్లి మండలం లక్ష్మీపురంకు చెందిన తుమ్మా వీరమ్మ అనే గర్భిణీకు బుధవారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. లక్ష్మీపురం చేరుకుని 108 సిబ్బంది ఆమెను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జీలగలగండి వద్ద పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో పైలట్ షఫీ, ఆశా వర్కర్ పార్వతి సహకారంతో ఈఎంటీ బసవరాజు ప్రసవం చేసి అనంతరం మచిలీపట్నం ఆసుపత్రిలో చేర్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.