నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన సంచాలకులు

54చూసినవారు
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన సంచాలకులు
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. పి. వి. సత్యనారాయణ నీటి ముంపులో ఉన్న ఘంటసాలలోని పంట పొలాలను శాస్త్రవేత్తలు, అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు ముంపులో నుంచి కాపాడుకోవటానికి రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని తెలియజేశారు. ముందుగా పొలాల్లో నుంచి నీటి బయటకు తీయాలన్నారు.

సంబంధిత పోస్ట్