అవనిగడ్డ మండలం వేకనూరులో జనసేన పార్టీ నాయకులు మాదివాడ ఏడుకొండలు ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. ఏడుకొండలు మృతికి తమ ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుడివాక శివరావు, ఉప సర్పంచ్ తుంగల మురళీకృష్ణ, గ్రామ ప్రముఖులు తుంగల రాజేష్ పాల్గొన్నారు.