మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సీఐడీ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు.