మోపిదేవిలో ప్రశాంతి నగర్ మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణ గ్రామ ప్రజలకు పోక్సో, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు, డయల్ 112, చోరీలు మరియు ఇతర అంశాలపై శనివారం రాత్రి అవగాహన కల్పించారు. అలాగే గంజాయి వంటి మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, అలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. అలాగే నేరాల నివారణకు గ్రామంలో అందరి సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.