ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కొలువైన శ్రీకాకుళేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఉదయం మోపిదేవలో ఆయన మాట్లాడుతూ, 11న స్వామివారి కల్యాణం, 12న రథోత్సవం జరగనుందన్నారు. ఫిబ్రవరిలో జరగాల్సిన శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందని, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆదేశాల మేరకు 14వ తేదీ జరుగుతుందన్నారు.