మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఒక్కరోజు స్వామివారికి వివిధ రూపాల్లో రూ. 7. 66 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. బుధవారం దేవస్థానంలో ఆయన మాట్లాడుతూ, ఆది, మంగళవారాల్లో స్వామివారి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.