నాగాయలంకలో జరుగుతున్న అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న ట్రాక్టర్ల నుంచి మట్టి గడ్డలు రోడ్లపై పడి ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని వారు కోరుతున్నారు.