మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతోత్సవ కార్యక్రమం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతమాత ముద్దుబిడ్డ,
భారతదేశం గర్వించదగ్గ అగ్రఘన్య ప్రముఖులు, దక్షిణ భారతదేశంలో ప్రధాని పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు, బహుభాషా కోవిదులు పాలపర్తి వెంకట నరసింహారావు అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.