రైతు బజార్ ద్వారా అందిస్తున్న బియ్యము, కందిపప్పు ధరలను మరోసారి తగ్గించినట్లు చల్లపల్లి ఇంచార్జి తహసిల్దార్ సి. హెచ్. ఎన్. ఎస్. ఎస్. ఎస్. కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. చల్లపల్లి రైతు బజారులో కందిపప్పు కిలో రూ. 160కు బదులుగా ఇకనుంచి రూ. 150కు అందిస్తారని తెలిపారు. రా రైస్ కిలో రూ. 48కు బదులుగా రూ. 47కు అందిస్తారని తెలిపారు. స్టీమ్ రైస్ కిలో రూ. 49కి బదులుగా రూ. 48కు అందిస్తారని వివరించారు.