ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరిపినందుకు కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకులో ఆదివారం నుంచి అమ్మకాలు నిలిపియడం జరిగిందని కోడూరు మండలం రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లూజ్ గా పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దని చెప్పినప్పటికీ పెట్రోల్ బంక్ వారు విక్రయాలు చేపట్టినందుకు అమ్మకాలు నిలిపివేసినట్టు తెలిపారు.